Lal Salaam: మతం కంటే మానవత్వం గొప్పది .. 'లాల్ సలామ్' ట్రైలర్ డైలాగ్!

  • ఈ నెల 9వ తేదీన 'లాల్ సలామ్' రిలీజ్ 
  • ప్రధానమైన పాత్రల్లో విష్ణు విశాల్ - విక్రాంత్ 
  • మొయిద్దీన్ భాయ్ పాత్రలో రజనీకాంత్ 
  • అతిథి పాత్రలో కనిపించనున్న కపిల్ దేవ్

Lal Salaam trailer released

రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమాను రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన సినిమా ఇది. విష్ణు విశాల్ - విక్రాంత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, రజనీకాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆ పాత్ర పేరే మొయిద్దీన్ భాయ్.

ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్, ఆకట్టుకునేలా ఉంది. 'మతం కంటే మానవత్వం గొప్పది' అంటూ రజనీ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.

రజనీ లుక్ .. ఆయన స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. చాలా కాలం తరువాత ఆయనకి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఒక వైపున గ్రామీణ రాజకీయాలు .. మరో వైపున క్రికెట్ నేపథ్యం చుట్టూ తిరిగే ఈ కథలో, కపిల్ దేవ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. 

More Telugu News