Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ఫైనాన్స్, ఐటీ స్టాకుల్లో లాభాల స్వీకరణ
  • 34 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • ఒక పాయింట్ పెరిగిన నిఫ్టీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్స్, ఐటీ స్టాకుల్లో ఇన్వెస్టర్లు లాభల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి కారణం. ఆ తర్వాత ఒడిదుడుకుల్లో కొనసాగుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 72,152కి పడిపోయింది. నిఫ్టీ 1 పాయింట్ లాభపడి 21,930 వద్ద స్థిరపడింది. అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 82.96గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.78%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.12%), యాక్సిస్ బ్యాంక్ (1.77%), బజాజ్ ఫైనాన్స్ (1.76%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.69%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.33%), టెక్ మహీంద్రా (-2.31%), ఇన్ఫోసిస్ (-2.06%), టీసీఎస్ (-1.22%), ఎన్టీపీసీ (-1.11%).

More Telugu News