గోవాలో ఇటలీ రాయబారి భార్య తలకు గాయం..రిసార్టు ఓనర్పై కేసు
- నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఉత్తర గోవాలో ఘటన
- రిసార్టు వద్ద టపాసులు పేల్చేందుకు అనుమతించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన రిసార్టు యజమాని
- టపాసులు తగలడంతో ఇటలీ రాయబారి భార్య తలకు గాయం
- గౌరవ వైస్ కాన్సుల్ ఆఫ్ ఇటలీ ఫిర్యాదుతో ఓనర్పై కేసు నమోదు
ఈ నేపథ్యంలో గౌరవ వైస్ కాన్సుల్ ఆఫ్ ఇటలీ శ్రీనివాస్ డెంపో ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 2న పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 338 కింద కేసు రిజిస్టర్ చేశామని పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాక తదుపరి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని వెల్లడించారు.