Under-19 World Cup: అండర్-19 వరల్డ్ కప్: భారత జట్టులో ఇద్దరు సెంచరీలు

  • దక్షిణాఫ్రికాలో అండర్-19 వరల్డ్ కప్
  • నేడు భారత్ వర్సెస్ నేపాల్
  • బ్లూంఫోంటీన్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 
Two Indian batters registers centuries against Nepal in Under 19 World Cup

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత జట్టు నేడు నేపాల్ తో తలపడుతోంది. బ్లూంఫోంటీన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 297 పరుగులు చేసింది. 

భారత్ ఇన్నింగ్స్ లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం. సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ సహారన్ సెంచరీలతో అదరగొట్టారు. సచిన్ దాస్ 101 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులతో 116 పరుగులు చేయగా... ఉదయ్ సహారన్ 107 బంతుల్లో 9 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అవుటయ్యాడు. 

ఆదర్శ్ సింగ్ 21, అర్షిన్ కులకర్ణి 18, ప్రియాన్షు మోలియా 19 పరుగులు చేశారు. నేపాల్ బౌలర్లలో గుల్షన్ ఝా 3, ఆకాశ్ చంద్ 1 వికెట్ తీశారు.

More Telugu News