Chiranjeevi: 'విశ్వంభర' సెట్స్ పై అడుగుపెట్టిన చిరంజీవి

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా విశ్వంభర
  • యువ దర్శకుడు వశిష్ఠకు చాన్స్ ఇచ్చిన చిరంజీవి
  • నవంబరులో షూటింగ్ ప్రారంభం
  • నేటి నుంచి చిరంజీవిపై సన్నివేశాల చిత్రీకరణ
Chiranjeevi steps into Vishwambhara sets

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న చిత్రం విశ్వంభర. చిరంజీవి నేడు ఈ చిత్రం సెట్స్ పైకి అడుగుపెట్టారు. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ నవంబరులోనే ప్రారంభమైంది. ఇప్పటివరకు ఇతర సన్నివేశాలను చిత్రీకరించారు. 

నేడు ప్రధాన షెడ్యూల్ ప్రారంభం కాగా, ఇక నుంచి చిరంజీవిపై సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. విశ్వంభర చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ఈ మేరకు అప్ డేట్ ఇచ్చింది. "విశ్వంభర మహా ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి కాలు మోపారు... ఏ లెజెండ్ రైజెస్" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 

కాగా, ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తుందని యూవీ క్రియేషన్స్ ప్రకటించింది. చిరంజీవికి ఇది 156వ చిత్రం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More Telugu News