హైదరాబాద్ లో గంజాయి అమ్ముతూ.. పట్టుబడ్డ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు
- డ్యూటీకి సెలవు పెట్టి కారులో గంజాయి తరలిస్తున్న వైనం
- శుక్రవారం తెల్లవారుజామున తనిఖీల్లో పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు
- కారులో 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న బాలానగర్ పోలీసులు
శుక్రవారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. దీంతో ఓ కారులో 22 కిలోల గంజాయి బయటపడింది. ఆ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విస్తుపోయే విషయం బయటపడింది. వారిద్దరూ ఏపీ పోలీస్ శాఖకు చెందిన వారని, కాకినాడలో ఒకరు హెడ్ కానిస్టేబుల్, మరొకరు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారని తేలింది. విధులకు సెలవు పెట్టి మరీ గంజాయి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిద్దరినీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు వివరించారు.