తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
- రాజకీయ పరిణతి, అనుభవంలేని రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరిక
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సీఎంలు స్వతంత్రంగా వ్యవహరించలేరని వ్యాఖ్య
- ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా
ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధిని చేసి చూపించారని కితాబునిచ్చారు. రైతులను ఆదుకున్నారని కొనియాడారు. భూగర్భ జలవనరులు పెరిగేందుకు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చేపట్టారని... మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించారన్నారు.