Nitish Kumar: అతనో బచ్చా... ఏం తెలియదు: తేజస్వి యాదవ్ పోస్టర్‌ వార్‌పై నితీశ్ కుమార్

  • 17 నెలల మహాఘట్‌బంధన్ క్రెడిట్ తేజస్వి యాదవ్‌దే అంటూ ఆర్జేడీ పోస్టర్లు
  • 'తేజస్వి యాదవ్ మీకు ధన్యవాదాలు. మీరు చెప్పారు... మీరు చేశారు... మీరే చేస్తారు' అంటూ ఆర్జేడీ పోస్టర్లు
  • జేడీయూ పోస్టర్లు అంతా బోగస్... క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని నితీశ్ విమర్శలు
Bachcha hai says Nitish Kumar about Tejaswi yadav

'అతను ఓ బచ్చా... ఏమీ తెలియదు' అని బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కామెంట్ చేశారు. లోక్ సభ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్ మహాఘట్‌బంధన్ నుంచి బయటకు వచ్చి... బీజేపీతో కలిసి తొమ్మిదోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 17 నెలల పాటు సీఎంగా నితీశ్, ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ఉన్నారు. ఇప్పుడు నితీశ్ కుమార్ బీజేపీ వైపుకు రావడంతో ఈ పదిహేడు నెలల్లో జరిగిన అభివృద్ధిపై జేడీయూ వర్సెస్ ఆర్జెడీగా సాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది.

17 నెలల కాలంలో జరిగిన అభివృద్ధికి మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కారణమని ఆర్జేడీ చెబుతుంటే... నితీశ్ కుమార్ వల్లే జరిగిందని జేడీయూ చెబుతోంది. 17 ఏళ్ల ఎన్డీయే పాలన కంటే గత 17 నెలల మహాఘట్‌బంధన్ పాలన బాగుందని... రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి తేజస్వి యాదవ్ కారణమని ఆర్జేడీ అంటోంది. ఈ మేరకు రాష్ట్రంలో పోస్టర్లు వేస్తోంది.

'తేజస్వి యాదవ్ మీకు ధన్యవాదాలు. మీరు చెప్పారు... మీరు చేశారు... మీరే చేస్తారు' అంటూ ఆర్జేడీ పోస్టర్లు వేస్తోంది. తేజస్వి యాదవ్ అతిపెద్ద 18 విజయాలు అంటూ ఈ పోస్టర్‌లలో వాటిని పేర్కొంది. వీటిలో 4 లక్షల ఉద్యోగాలు, బీహార్‌లో క్యాస్ట్ సర్వే, 75 శాతానికి రిజర్వేషన్లు, 4 లక్షల కాంట్రాక్ట్ టీచర్లు, నాణ్యమైన విద్య, మెడల్స్ సాధించండి... ఉద్యోగం పొందండి వంటి పథకం అమలు, టూరిజం పాలసీ, ఐటీ పాలసీ తదితర విజయాలు తేజస్వి యాదవ్ వల్లే సాధ్యమైనట్లు పోస్టర్లలో పేర్కొంది.

అదంతా బోగస్

జేడీయూ పోస్టర్లు అంతా బోగస్ అని నితీశ్ కుమార్ విమర్శించారు. అదంతా చేసింది తామే అన్నారు. ఉద్యోగాల కల్పన కూడా తన ఏడు హామీలు పార్ట్ 2లో భాగంగా అమలు చేసినవే అన్నారు. కానీ ఈ క్రెడిట్ ఇతరులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 17 నెలల కాలంలో బీహార్ అభివృద్ధి క్రెడిట్‌ను తేజస్వి యాదవ్, ఆర్జేడీ తీసుకోవడంపై నితీశ్ కుమార్ స్పందిస్తూ... అతనో బచ్చా... అతనికేమీ తెలియదు అని తేజస్వి యాదవ్‌ను ఉద్ధేశించి అన్నారు. 1990 నుంచి 2005 మధ్య లాలూ, ఆయన భార్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సాయంకాలం దాటిందంటే ప్రజలు బయటకు రావాలంటే భయపడేవారన్నారు. కానీ తమ హయాంలో పరిస్థితులు మారినట్లు చెప్పారు.

More Telugu News