CPI Narayana: రేవంత్‌ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలి: సీపీఐ నారాయణ

  • కేసులతో బీజేపీ భయపెడితే న్యాయపోరాటం చేయాలన్న సీపీఐ జాతీయ కార్యదర్శి 
  • భయపడినకొద్దీ మరింతగా లొంగదీసుకుంటారని వ్యాఖ్య 
  • అన్ని పార్టీలను కలుపుకుని వెళితేనే విజయం సులువవుతుందని సూచన
CPI Narayana Key Comments on Chandrababu

తెలంగాణ సీఎం రేవంత రెడ్డిని చూసైనా చంద్రబాబు ధైర్యం తెచ్చుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. కేసులతో బీజేపీ భయపెడితే న్యాయపోరాటం చేయాలి కానీ భయపడటమేంటని ప్రశ్నించారు. భయపడినకొద్దీ వారు మరింతగా లొంగదీసుకునేందుకు చూస్తారని హెచ్చరించారు. అన్ని పార్టీలను కలుపుకుని వెళితేనే విజయం సాధించడం సులువవుతుందని సూచించారు. 

‘‘చంద్రబాబు ఒడ్డుపొడుగులో రేవంత్ రెడ్డి సగం ఉంటాడు. మరి రేవంత్ రెడ్డికి ఉన్న ధైర్యం బాబుకు లేదా? రేవంత్ రెడ్డితో మాట్లాడి టన్ను ధైర్యం తీసుకుని చంద్రబాబుకు ఇమ్మని చెప్పా. నిలబడి పోరాడితే ఏమౌతుంది?’’ అని ప్రశ్నించారు. కేసులు పెండింగ్‌లో ఉన్నా భయపడేదేముందని అన్నారు. ఒకసారి జైలుకు పోయివచ్చారు కాబట్టి చలి తీరిపోయిందని వ్యాఖ్యానించారు. ఫైట్ చేయకుండా భయపడితే మరింత లొంగదీసుకోనేందుకు ప్రయత్నిస్తారని నారాయణ అన్నారు.

More Telugu News