రెండు లీటర్ల నువ్వుల నూనెను క్షణాల్లో తాగేసిన ‘తొడసం’ ఆడపడుచు!
- ఆదిలాబాద్లోని ఉట్నూరు ఏజెన్సీలో ప్రారంభమైన నార్నూర్ కామ్దేవ్ జాతర
- తొడసం వంశీయుల పూజలతో ప్రారంభం
- వరుసగా రెండోసారి నూనె తాగిన మేస్రం నాగుబాయి చందు
- నూనె తాగడం వల్ల మేలు జరుగుతుందని విశ్వాసం
జాతరలో ఇలా నువ్వుల నూనె తాగడం ఆచారంగా వస్తోంది. ఆడపడుచు హోదాలో ముందుకొచ్చే మహిళ వరుసగా మూడేళ్లపాటు ఈ జాతరలో నువ్వుల నూనె తాగాల్సి ఉంటుంది. మహారాష్ట్రలోని జవితా తాలూకా కొద్దెపూర్ గ్రామానికి చెందిన చందు నూనె తాగడం వరుసగా ఇది రెండోసారి. ఇలా నూనె తాగడం వల్ల మంచి జరుగుతుందని తొడసం వంశీయులు విశ్వసిస్తారు.