రంజీల్లో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ సంచలనం.. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
- ఫస్ట్క్లాస్ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా రికార్డు
- విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ రికార్డు సహా మరికొందరి రికార్డులు బద్దలు
- 39 ఏళ్ల క్రితం రవిశాస్త్రి సాధించిన అత్యంత వేగవంతమైన రికార్డును కూడా తుడిచిపెట్టేసిన తన్మయ్
2017-18లో దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో మరియస్ 191 బంతుల్లో త్రిశతకం సాధించాడు. న్యూజిలాండ్కు చెందిన కెన్ రూథర్ఫర్డ్ 234, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ 244, శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా 244 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించారు. తన్మయ్ ఇప్పుడా రికార్డులన్నింటినీ బద్దలుగొట్టాడు. అంతేకాదు, ఇదే మ్యాచ్లో భారత క్రికెట్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన (119 బంతుల్లో) ఆటగాడిగానూ తన్మయ్ రికార్డులకెక్కాడు. 39 సంవత్సరాల క్రితం రవిశాస్త్రి (123 బంతుల్లో) నమోదు చేసిన రికార్డు కూడా తుడిచిపెట్టుకుపోయింది.