KTR: రోడ్డు పక్కన హోటల్‌లో మిర్చి బజ్జీ రుచి చూసిన కేటీఆర్... ఇదిగో వీడియో

  • కరీంనగర్‌లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి హాజరైన కేటీఆర్
  • తిరుగు ప్రయాణంలో కొత్తపల్లిలో ఓ హోటల్ వద్ద మిర్చి భజ్జీ తిని, ఛాయ్ తాగిన కేటీఆర్
  • అన్నను తీసుకువచ్చినందుకు నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఇవ్వాలన్న రసమయి
  • ఏం సెంటిమెంట్ అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
KTR tastes Mirchi Bhajji at road side hotel

  కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ స్థాయి సోషల్ మీడియా వారియర్స్‌తో ఈ రోజు జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో మానకొండూర్ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద ఓ హోటల్ వద్ద ఆగారు. హోటల్ వద్ద మహిళను అడిగి ఓ మిరపకాయ బజ్జీని తీసుకొని తిన్నారు. స్థానికులతో కాసేపు ముచ్చటించారు. 

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ హోటల్ యజమానురాలిని ఉద్దేశించి.. 'అమ్మా.. తల్లీ.. నేను అన్నను తీసుకొచ్చాను... నువ్వు నాకు ఎప్పుడైనా ఫ్రీగా ఇవ్వాలి' అని సరదాగా అన్నారు. దానికి కేటీఆర్ నవ్వుతూ... ఏం సెంటిమెంట్? అన్నారు. 

నేను ఓ మిర్చి తీసుకుంటున్నానని హోటల్ యజమానురాలికి చెప్పి మరీ కేటీఆర్ ఓ మిర్చీని తీసుకొని రుచి చూశారు. కేటీఆర్ వెంట రసమయి బాలకిషన్, బోయినపల్లి వినోద్ కుమార్, గంగుల కమలాకర్ తదితరులు ఉన్నారు. వారంతా మిర్చీ తింటూ... ఆ తర్వాత ఛాయ్ తాగి కాసేపు కూర్చొని ముచ్చటించారు. కేటీఆర్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

More Telugu News