Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలోకి కోతి.. స్వయంగా హనుమంతుడే వచ్చాడంటూ ట్రస్ట్ ట్వీట్

  • గర్భాలయంలో రాముడి విగ్రహం వరకు వెళ్లిన కోతి
  • మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటన
  • పట్టుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బంది
  • ఎలాంటి గలాటా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిన కోతి
A monkey entered the Ram mandir sanctum sanctorum on Tuesday evening

అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ వేడుకల తర్వాత మంగళవారం నుంచి అయోధ్య రాముడి దర్శనానికి సాధారణ భక్తులను అనుమతించారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులు బాలక్ రామ్ ను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆలయంలో చోటుచేసుకున్న ఘటన పూజారులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్వామి దర్శనానికి సోమవారం రాత్రి నుంచే క్యూ కట్టిన భక్తులతో పాటు ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ కోతి కూడా బాలక్ రామ్ ను దర్శించుకుంది. ఏకంగా గర్భాలయంలో రాముడి విగ్రహం సమీపంలోకి వెళ్లింది.

విగ్రహాన్ని పడేస్తుందేమోననే భయంతో దానిని పట్టుకునేందుకు సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకు రాగా.. వారిని చూసి ఎలాంటి గొడవ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయింది. ఈ ఘటనపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ బుధవారం స్పందించింది. తన రాముడిని పూజించుకోవడానికి స్వయంగా హనుమంతుడే వచ్చాడని భావిస్తున్నట్లు ట్వీట్ చేసింది. కాగా, ఈ ఘటనను చూసి రాముడితో పాటు హనుమాన్ దర్శనం కూడా చేసుకున్నామంటూ భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.

More Telugu News