Virat Kohli: అయోధ్యలో కోహ్లీ డూప్.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం.. వీడియో ఇదిగో!

  • ఆహ్వానం అందినా ప్రాణప్రతిష్ఠకు హాజరుకాని కోహ్లీ దంపతులు
  • టీమిండియా జెర్సీతో అయోధ్యకు వచ్చిన కోహ్లీ డూప్
  • సెల్ఫీల కోసం చుట్టుముట్టిన కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Virat Kohli Lookalike Mobbed By Fans For Selfies

అయోధ్యలో సోమవారం జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో హాజరయ్యారు. ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరుకాలేకపోయారు. వారిలో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కూడా ఉన్నారు. అయితే, అచ్చంగా కోహ్లీలానే ఉండే వ్యక్తి అయోధ్యలో సందడి చేశాడు. టీమిండియా జెర్సీ ధరించి వచ్చిన కోహ్లీ డూప్ తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు.

కోహ్లీ డూప్ అని తెలిసినా ఆయనను చుట్టుముట్టి ఫొటోలు తీసుకున్నారు. తొలుత సరదాగా సాగిన ఈ తతంగం కాసేపటికే తోపులాట దాకా వెళ్లింది. దీంతో బెదిరిపోయిన కోహ్లీ డూప్.. చుట్టుముట్టిన జనంలో నుంచి కష్టమ్మీద బయటపడ్డాడు. ఆపై వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సెలబ్రెటీలకే కాదు వారి పోలికలతో వుండే డూప్ లకూ అభిమానుల బెడద తప్పడంలేదంటూ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News