రేవంత్ రెడ్డి లాంటి వారిని పాతికేళ్లుగా ఎంతోమందిని చూశాం!: కేటీఆర్
- బీఆర్ఎస్ను 100 మీటర్ల లోతున పాతిపెట్టే మాట పక్కన పెట్టి.. 100 రోజుల్లో హామీలు నెరవేర్చాలని సూచన
- తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడతావ్? తెలంగాణ తెచ్చినందుకా? అని ప్రశ్న
- రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే కావడం గ్యారెంటీ అని వ్యాఖ్య
- జనవరి నుంచి ప్రజలు కరెంట్ బిల్లులు కట్టకూడదంటూ పిలుపు
లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే కావడం గ్యారెంటీ అన్నారు. ఆయన రక్తమంతా బీజేపీదేనని... ఇక్కడ ఓ చోటా మోదీలా మారారని వ్యాఖ్యానించారు. అదానీ, రేవంత్ రెడ్డిల ఒప్పందాల అసలు గుట్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
జనవరి నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దు
జనవరి నెల కరెంట్ బిల్లులను ప్రజలు ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ సూచించారు. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లును ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. కరెంట్ బిల్లులను 10-జన్పథ్లోని సోనియా గాంధీ నివాసానికి పంపించాలన్నారు. వాగ్దానం చేసినట్టుగా ప్రతి మహిళకు నెలకు రూ.2500ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇస్తున్నామని.. హామీలను అమలు చేయకుంటే వదిలేది లేదని హెచ్చరించారు.