రైతుబంధుపై ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది: శుభవార్త చెప్పిన తుమ్మల
- రేపటి నుంచి దశలవారీగా రైతులకు రైతుబంధు నిధులు అందిస్తామని వెల్లడి
- రెండు లక్షల రైతుల రుణమాఫీని దశలవారీగా ఖాతాల్లో జమ చేస్తామని వివరణ
- తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందేనంటూ వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందేనని... అయినప్పటికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగ సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరు అన్నారు. నేటికీ ఎన్టీఆర్ తనకు ఆదర్శప్రాయుడన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చారని కితాబునిచ్చారు.