Sivaji: సుదీర్ఘ విరామం తర్వాత శివాజీ రీ ఎంట్రీ... 'కూర్మ నాయకి' చిత్రంలో కీలకపాత్ర

  • వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'కూర్మ నాయకి'
  • నేడు మోషన్ పోస్టర్ విడుదల
  • వీడియో షేర్ చేసిన శివాజీ
Actor Sivaji makes come back after long time

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'కూర్మ నాయకి'. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అందరి కష్టాలు తీర్చే దేవుడికి ప్రజల వల్ల కష్టం వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర కథాంశం. 

అసలు విషయానికొస్తే ఈ చిత్రం ద్వారా నటుడు శివాజీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. చాన్నాళ్లుగా కెమెరా ముందుకు రాని శివాజీ... ఇటీవల బిగ్ బాస్ సీజన్-7 రియాలిటీ షోతో అందరినీ అలరించారు. ఆ తర్వాత ఓ వెబ్ సిరీస్ లోనూ నటించారు. ఇన్నాళ్లకు 'కూర్మ నాయకి' చిత్రంతో వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ చిత్రంలో శివాజీ పాత్ర చాలా కీలకమైనదని తెలుస్తోంది. 

'కూర్మ నాయకి' చిత్రబృందం నేడు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ మోషన్ పోస్టర్ వీడియోను శివాజీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూస్తారని సినిమాపై ఆసక్తి పెంచారు.

More Telugu News