Team India: రెండో టీ20... ఆఫ్ఘన్ పై టీమిండియా బౌలర్ల జోరు

  • ఇండోర్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్
Team India won the toss in 2nd T20

టీమిండియా, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య నేడు రెండో టీ20 జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ఇందోర్ లోని హోల్కర్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టే టీమిండియా బౌలర్లు సత్తా చాటడంతో ఆఫ్ఘన్ జట్టు 60 పరుగులకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, శివం దూబే తలో వికెట్ తీశారు. ఆఫ్ఘన్ స్టార్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ 14, కెప్టెన్ ఇబ్రహీం జాద్రాన్ 8, అజ్మతుల్లా ఒమర్జాయ్ 2 పరుగులు చేశారు ప్రస్తుతం ఆఫ్ఘన్ స్కోరు 9 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు. గుల్బదిన్ నాయబ్ 48 పరుగులతోనూ, మహ్మద్ నబీ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కూడా ఆడుతున్నాడు.

More Telugu News