71 ఏళ్ల వయస్సులోనూ నేను ఎంత స్మార్ట్గా ఉన్నానో చూడండి: మాజీ మంత్రి మల్లారెడ్డి
- బోయినపల్లిలో చిన్నారులకు పతంగులు పంచిన మల్లారెడ్డి
- పిల్లలతో కలిసి గాలి పటాలు ఎగురవేసిన మాజీ మంత్రి
- గోవా వెళ్లి ఎంజాయ్ చేసినట్లు చెప్పిన మల్లారెడ్డి
- అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి లోక్ సభ కు పోటీ చేస్తానని స్పష్టీకరణ
తాను గోవాకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లానని.. ప్యారాచూట్ అడ్వెంచర్ చేశానని... అండర్ వాటర్ సీలోకి వెళ్లానని... సముద్రంపై చక్కర్లు కొట్టానని... బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. తాను ఇలాగే మెయింటైన్ చేస్తానని.. అందరూ కూడా తనలా చేయాలని సూచించారు. మూడు పూటలు తిని.. నిమ్మలంగా పడుకోవడం కాదని.. ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. '71 ఏళ్ళు ఉన్నప్పటికీ... నేను ఎంత స్మార్ట్గా ఉన్నానో చూసుకోండి' అంటూ హుషారెత్తించారు. ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలని సూచించారు. అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి తాను నిలబడతానని స్పష్టం చేశారు.