Revanth Reddy: రాహుల్ గాంధీ యాత్ర... మణిపూర్‌కు వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

  • ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి
  • తొలి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని తిరిగి ఢిల్లీకి రాక
  • ఆ తర్వాత దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు బయలుదేరనున్న రేవంత్ రెడ్డి
Revanth Reddy to go Manipur for Bharat Jodo Nyay Yatra

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్‌కు వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేబట్టే భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి మణిపూర్ వెళ్లనున్నారు. తొలి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వస్తారు. అనంతరం దావోస్‌లో జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సుకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా దావోస్‌కు వెళ్లనున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వారితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రెండు ఎమ్మెల్సీల నామినేష‌న్లపై చర్చించనున్నారు. కాగా, మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రయివేటు స్థ‌లం నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం కానుంది.

More Telugu News