జగన్ ఆలోచించి నాకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నా: ఎమ్మెల్యే పెండెం దొరబాబు
- పిఠాపురం ఇన్ఛార్జీగా వంగా గీతను నియమించిన జగన్
- తీవ్ర అసంతృప్తికి గురైన పెండెం దొరబాబు
- నియోజకవర్గంలో తనకే పట్టు ఉందన్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ... పిఠాపురం స్థానంపై జగన్ పునరాలోచించాలని చెప్పారు. ఈ నియోజకవర్గంలో తనకే ఎక్కువ పట్టు ఉందని... తన జన్మదిన వేడుకలకు వేలాది మంది హాజరై మద్దతు తెలిపారని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని చెప్పారు. జగన్ ఆలోచించి తనకే టికెట్ ఇస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.