Revanth Reddy: ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి
  • ఉరుస్-ఏ-షరీఫ్ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఢిల్లీలో చాదర్ సమర్పించిన ముఖ్యమంత్రి
  • రేవంత్ రెడ్డి వెంట మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు
Revanth Reddy reaches Delhi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్నారు. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన దేశ రాజధానికి చేరుకున్నారు. ఉరుస్-ఎ-షరీఫ్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరపున ఢిల్లీలోని హజ్రత్ ఖాజా గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ దర్గాకు  గిలాఫ్ ఇ చాదర్‌ను ఆయన సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.

More Telugu News