Anand Mahindra: టైటానిక్ ఇప్పుడు మునిగిపోయి ఉంటే...!: ఆనంద్ మహీంద్రా ట్వీట్

  • సోషల్ మీడియాలో మరో ఆసక్తికర పోస్టు పంచుకున్న ఆనంద్ మహీంద్రా
  • నీళ్లలో మునిగిపోతున్న టైటానిక్ నౌక
  • నీళ్లలో పడిన ప్రయాణికులు మునుగుతున్న నౌకను మొబైల్ లో చిత్రీకరిస్తున్న వైనం
  • ఈ మీమ్ ప్రజల ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోందన్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra shares If Titanic sank today meme

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పంచుకున్నారు. టైటానిక్ నౌక మునిగిపోతుండగా, నీళ్లలో పడిపోయిన ప్రయాణికులు ఆ నౌక మునిగిపోతుండడాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఫొటోను ఆయన పంచుకున్నారు. 

"టైటానిక్ నౌక ఇప్పుడు మునిగిపోయి ఉంటేనా... అనే ఈ మీమ్ మొదటిసారిగా 2015లో తెరపైకి వచ్చింది. అప్పటికి ఇప్పటికి ప్రజల ఆలోచనా ధోరణిలో ఏ మార్పు లేదు. రోజులు గడిచేకొద్దీ ఆ మీమ్ ఇప్పటివాళ్ల ఆలోచనా విధానానికి మరింత దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

సమాజంలో ఏదైనా ఘటన జరిగితే దాన్ని మొబైల్ లో చిత్రీకరించే ధోరణి ప్రబలిపోతుండడం పట్ల సెటైరికల్ గా ఈ మీమ్ ను అప్పట్లో రూపొందించారు. దాన్నే ఇప్పుడు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

More Telugu News