చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ... ప్రమాద ఘటన ఫొటోలు ఇవిగో
- సాయంత్రానికి రైలును పునరుద్ధరించిన దక్షిణ మధ్య రైల్వే
- ఎంఎంటీఎస్ సర్వీసులకు మినహా ఏ ఇతర రైళ్లకు ఇబ్బంది కలగలేదని వెల్లడి
- ప్రమాద రైలు కోచ్లను టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించిన అధికారులు
సాయంత్రానికి చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు పునరుద్ధరించారు. పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులకు మినహా ఏ ఇతర రైళ్లకు ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద రైలు కోచ్లను టెస్టింగ్ కోసం షెడ్డుకు తరలించినట్లు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ధనంజయులు నేతృత్వంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై చట్టబద్ధమైన విచారణ నిర్వహిస్తామని తెలిపారు. సౌత్ సెంట్రల్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ నేతృత్వంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.