అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం పిరికిపంద చర్య: పీతల సుజాత
- ఏపీలో 28 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు
- అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించిన ప్రభుత్వం
- తాము అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచామన్న పీతల సుజాత
- టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తుందని హామీ
ఈ నేపథ్యంలో, టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తప్పుబట్టారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అడుగుతున్న అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం పిరికిపంద చర్య అని మండిపడ్డారు.
భీమవరంలో పీతల సుజాత ఇవాళ అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, టీడీపీ హయాంలో అంగన్వాడీలకు రెండు సార్లు జీతాలు పెంచామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.