Telangana BJP: తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జీల నియామకం.. జాబితా ఇదిగో!

  • లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ
  • హైదరాబాద్ ఇన్ఛార్జీగా రాజాసింగ్
  • సికింద్రాబాద్ ఇన్ఛార్జీగా డాక్టర్ లక్ష్మణ్
BJP incharges for Telangana Lok Sabha constituencies

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి పార్లమెంటు ఎన్నికలపై ఉంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇన్ఛార్జీలను ప్రకటించింది. 

నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు:

  • ఆదిలాబాద్ - పాయల్ శంకర్ (ఎమ్మెల్యే)
  • పెద్దపల్లి - రామారావ్ పవార్ (ఎమ్మెల్యే)
  • కరీంనగర్ - సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
  • నిజామాబాద్ - మహేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే)
  • జహీరాబాద్ - కె.వెంకటరమణా రెడ్డి (ఎమ్మెల్యే)
  • మెదక్ - పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
  • మల్కాజిగిరి - పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
  • సికింద్రాబాద్ - డాక్టర్ లక్ష్మణ్ (ఎంపీ)
  • హైదరాబాద్ - రాజాసింగ్ (ఎమ్మెల్యే)
  • చేవెళ్ల - ఏ వెంకటనారాయణ రెడ్డి (ఎమ్మెల్సీ)
  • మహబూబ్ నగర్ - రామ్ చందర్ రావు (మాజీ ఎమ్మెల్సీ)
  • నాగర్ కర్నూల్ - రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
  • నల్గొండ - చింతల రామచంద్రా రెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
  • భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
  • వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
  • మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
  • ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)

More Telugu News