Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్

  • సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ గవర్నర్
  • ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించిన నరసింహన్
  • 2009 నుంచి 2019 వరకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్
Former governor Narasimhan meets CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిశారు. శనివారం నాడు తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని ఆయన కలిశారు. నరసింహన్ మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్న సమయంలో ఆయన ఉమ్మడి ఏపీకి గవర్నర్‌గా వచ్చారు. 2009 నుంచి రాష్ట్రం విడిపోయే వరకు గవర్నర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు తెలంగాణకు, ఎపీకి కూడా గవర్నర్‌గా పని చేశారు. 

More Telugu News