Gautam Adani: ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతం అదానీ.. ముకేశ్ అంబానీ వెనక్కి!

  • నివేదిక విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్
  • ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో అదానీ, 13లో అంబానీ
  • గతేడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంకింగ్స్
Gautam Adani once again become Indias richest man

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) నివేదిక పేర్కొంది.

మరోవైపు, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అదానీ ఒక్క స్థానం దిగువన 13లో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.

More Telugu News