KTR: ధిక్కరిస్తే కఠిన చర్యలు: పార్టీ నాయకులకు కేటీఆర్ తీవ్ర హెచ్చరిక

  • కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ వసంత సురేశ్, జెడ్పీటీసీ సభ్యులు
  • కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ప్రజాప్రతినిధులు
  • కేటీఆర్.. జిల్లా నాయకుల మధ్య అవిశ్వాస తీర్మానంపై చర్చ
KTR warns BRS party leaders

పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా పార్టీ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ వసంత సురేశ్, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా నాయకులు గురువారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారి మధ్య జెడ్పీ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. 

 ఈ సందర్భంగా జెడ్పీటీసీలు మాట్లాడుతూ... జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్‌పై వస్తోన్న అవిశ్వాస తీర్మానం పూర్తి అవాస్తవం అన్నారు. పూర్తి పదవీకాలం ఆమెనే కొనసాగుతారని వారు... కేటీఆర్‌కు చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ ఆదేశాలు ఎవరూ ధిక్కరించకూడదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశా నిర్దేశనం చేశారు.

More Telugu News