Team India: టీమిండియా ప్రతీకారం... ఒకటిన్నర రోజులోనే దక్షిణాఫ్రికా ఫినిష్

  • ముగిసిన రెండో టెస్టు
  • 79 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లకు ఛేదించిన టీమిండియా
  • సిరీస్ 1-1తో సమం
Team India takes revenge by beating South Africa in just one and half day

సఫారీ గడ్డపై తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా... రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత రీతిలో నెగ్గింది. తద్వారా దక్షిణాఫ్రికాపై ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజులోనే ముగిసింది. 

రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 12 ఓవర్లలోనే ఛేదించింది. ఈ క్రమంలో 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 28, కెప్టెన్ రోహిత్ శర్మ 17 (నాటౌట్), శుభ్ మాన్ గిల్ 10, విరాట్ కోహ్లీ 12, శ్రేయాస్ అయ్యర్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 1, నాండ్రే బర్గర్ 1, మార్కో యన్సెన్ 1 వికెట్ తీశారు.

ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 153 పరుగులు చేసింది. అనంతరం, దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 176 పరుగులు సాధించింది.

More Telugu News