పరకాల ప్రభాకర్ కు మాతృవియోగం
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాళికాంబ
- బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస
- కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు కాళికాంబ స్వయానా అత్తగారు
ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం నియోజకవర్గం నుంచి 1981లో కాళికాంబ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె భర్త పరకాల శేషావతారం ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా సేవలందించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కొడుకు పరకాల ప్రభాకర్, కోడలు నిర్మలాసీతారామన్. కాగా, బుధవారం కాళికాంబ అంత్యక్రియలు నిర్వహించారు.