Gautam Adani: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ

  • సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కరణ్ అదానీ
  • రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపిన అదానీ ప్రతినిధులు
  • పరిశ్రమలకు తగిన వసతులు, రాయితీలను కల్పిస్తామని సీఎం హామీ
Karan Adani meets CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తనయుడు కరణ్ అదానీ నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు కలిశారు. సచివాలయంలో వారు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అదానీ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ పరిశ్రమలకు తగిన వసతులు... రాయితీలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News