ఇండియా - పాక్ మ్యాచ్ లకు క్రేజ్ లేదు.. అసలైన పోటీ ఈ దేశాల మధ్యే: గౌతమ్ గంభీర్
- ఇప్పుడు ఇండియా -ఆస్ట్రేలియాల మధ్య ఎక్కువ పోటీ ఉందన్న గంభీర్
- పాకిస్థాన్ కంటే ఇండియా ఎంతో సుపీరియర్ గా ఉందన్న మాజీ క్రికెటర్
- ఏ క్రికెట్ అభిమానిని అడిగినా ఇదే చెపుతాడని వ్యాఖ్య
క్రికెట్ చరిత్రలో ఎన్నో సార్లు ఇండియాను పాకిస్థాన్ డామినేట్ చేసిందని... కానీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే మూడు ఫార్మాట్లలో కూడా పాక్ కంటే టీమిండియా ఎంతో సుపీరియర్ గా ఉందని గంభీర్ చెప్పారు. గతంలో మాదిరి ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠను పెంచేంత సమతుల్యత లేదని అన్నారు. ఇండియా గెలిస్తే ఊహించిందే జరిగిందని అనుకుంటామని... పాక్ గెలిస్తే నిరాశకు గురవుతామని... అంతకు మించి ఏమీ ఉండదని చెప్పారు.