Tsunami: జపాన్ కు సునామీ వార్నింగ్... అప్రమత్తమైన భారత్

  • జపాన్ పశ్చిమ తీరంలో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు
  • జపాన్ కు సునామీ హెచ్చరికలు
  • వజిమా నగరాన్ని బలంగా తాకిన సునామీ అలలు
  • జపాన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన భారత్
India alerts after Tsunami warning for Japan

జపాన్ పశ్చిమ భాగాన్ని నేడు తీవ్ర భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6గా నమోదైంది. భారీ భూకంపం నేపథ్యంలో జపాన్ లోని ఇషికావా, నిగాటా, టొయోమా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటికే వజిమా నగరాన్ని సునామీ అలలు బలంగా తాకాయి. 

ఈ నేపథ్యంలో, భారత్ అప్రమత్తమైంది. జపాన్ లోని భారత పౌరులకు సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జపాన్ లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ను 818039301715, 817014920049, 818032144734, 818062295382, 818032144722 నెంబర్లలో సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

More Telugu News