KPHB: కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడి బలి

  • కూకట్ పల్లిలో బైక్ ను ఢీ కొట్టిన కారు
  • తీవ్ర గాయాలతో బైకర్ దుర్మరణం
  • స్కోడా కారు డ్రైవర్ పై కేసు నమోదు
Car Accident In Kukatpally Housing Board

హైదరాబాద్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి యువకుడు బలయ్యాడు. స్నేహితుడితో కలిసి బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డ్ లో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మోతీనగర్ కు చెందిన అరుణ్ (33) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

ఆదివారం తన బైక్ పై హౌసింగ్ బోర్డ్ కాలనీకి వెళ్లాడు. స్నేహితుడితో కలిసి హైదర్ నగర్ వైపు వెళుతుండగా ఓ స్కోడా కారు వీరి బైక్ ను వేగంగా ఢీ కొట్టింది. దీంతో అరుణ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలు, తీవ్ర రక్తస్రావం కారణంగా అరుణ్ స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు, పోలీసులు ఆరోపించారు. స్కోడా కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

More Telugu News