Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వాహనం ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు

  • ముదిగుబ్బ మండలంలో యాక్సిడెంట్
  • బైక్ ను ఢీ కొట్టిన ఎమ్మెల్యే ఎస్కార్ట్ జీప్
  • బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే ఆదేశాలు
Mla Kethireddy Venkatarami Reddy Vehicle Collided Two Men seriously Injured

ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీ కొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వద్ద ఆరా తీసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటన ఆదివారం ముదిగుబ్బ మండలం మొలకవేమల క్రాస్ వద్ద జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. నల్లమడ మండలం కొండ కింద తండాకు చెందిన నారాయణ నాయక్, పీకానాయక్ లు కదిరి నుంచి స్వగ్రామానికి బైక్ పై బయలుదేరారు.

మొలకవేమల క్రాస్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎస్కార్ట్ వాహనం ఢీ కొట్టింది. దీంతో నారాయణ నాయక్, పీకానాయక్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు.. వారిద్దరినీ కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు గాయపడిన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. ఎస్కార్ట్ వాహనం అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా, బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి విచారించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News