కాకినాడలో అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ విగ్రహం తొలగింపునకు యత్నం... అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- కాకినాడ దుర్గమ్మ ఆలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు యత్నం భగ్నం
- ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుల పనే అంటూ టీడీపీ వర్గం ఆందోళన
- ఇరువర్గాలను డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి మాట్లాడిన పోలీసులు
అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను డీఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లి వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.
ఆరేళ్ల కిందట చేసిన కౌన్సిల్ తీర్మానం మేరకే ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశామని, ఆ విగ్రహం వల్ల ఎవరికీ ఇబ్బంది లేకపోయినా, ఇప్పుడు కుట్రపూరితంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి.