సిట్టింగ్ ఎంపీలకు అమిత్ షా పచ్చజెండా... ముఖ్య నేతలకు అగ్రనేత హెచ్చరిక!
- మిగిలిన లోక్ సభ స్థానాలపై ఆరా తీసిన అమిత్ షా
- అసెంబ్లీ ఎన్నికల్లో నేతల మధ్య గ్యాప్ దెబ్బతీసిందన్న కేంద్రమంత్రి
- లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటివి పునరావృతం కావొద్దని హెచ్చరిక!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల మధ్య గ్యాప్ దెబ్బతీసిందని, ఇది లోక్ సభ ఎన్నికల్లో రిపీట్ కావొద్దని నేతలకు హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్ళి పార్టీకి నష్టం చేయవద్దని హితవు పలికారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన భాగ్యలక్ష్మి దేవాలయంకు బయలుదేరారు.
కాగా తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, అదిలాబాద్ నుంచి సోయం బాపురావు గత లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ స్థానాల నుంచి తిరిగి వీరే పోటీ చేయనున్నారు.