వైసీపీకి 29కి మించి సీట్లు రావు.. నేను టీడీపీకి సపోర్ట్ చేయడానికి కారణమిదే: సినీ నిర్మాత నట్టి కుమార్
- సినీ ఇండస్ట్రీ మొత్తం టీడీపీ వైపే ఉందన్న నట్టి కుమార్
- త్వరలోనే చంద్రబాబును కలుస్తానని వెల్లడి
- టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని ధీమా
వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది? రఘురామకృష్ణరాజును ఎలా చిత్ర హింసలు పెట్టారు? వైసీపీ ఎలాంటి అరాచకాలు చేసింది? ఇలాంటి విషయాలను తన సినిమాలో చూపిస్తానని నట్టి కుమార్ చెప్పారు. వివేకా మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలపై తన కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి 130 నుంచి 150 సీట్లు వస్తాయని... వైసీపీ 29 సీట్లకు పరిమితమవుతుందని చెప్పారు.