Congress: ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు 10 జిల్లాల్లో నోడల్ అధికారులు వీరే

  • రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన
  • అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణకు నోడల్ అధికారుల నియామకం
  • పదిమందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
Government appoints Nodel officers for Abhaya Hastham applications

రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు జరగనున్న ప్రజాపాలన సందర్భంగా అభయహస్తం దరఖాస్తుల స్వీకరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోడల్ అధికారులను నియమించింది. ఉమ్మడి పది జిల్లాలకు పదిమంది నోడల్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా జిల్లాలకు సంబంధించి నోడల్ అధికారులు వీరే... కరీంనగర్ - శ్రీదేవసేన, వరంగల్ - వాకాటి కరుణ, హైదరాబాద్ - కె.నిర్మల, మహబూబ్ నగర్ - టీకే శ్రీదేవి, ఖమ్మం - రఘునందన్ రావు, రంగారెడ్డి - శ్రీధర్, మెదక్ - ఎస్ సంగీత, అదిలాబాద్ - ఎం ప్రశాంతి, నల్గొండ - ఆర్వీ కర్ణన్, నిజామాబాద్ - క్రిస్టినాలను నియమించారు.

More Telugu News