TTD: ​టీటీడీ పాలకమండలి తాజా నిర్ణయాలు ఇవిగో!

  • భూమన అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం
  • పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
  • పోటు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు
  • టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న ఇంటి పట్టాలు

TTD Board meeting concluded

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి నేడు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఇవాళ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో... శ్రీవారి ప్రసాదం పోటు కార్మికుల వేతనాల పెంపు, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టీటీడీ నిర్ణయాలు ఇవిగో....

  • శ్రీవారి ప్రసాదం పోటు కార్మికుల వేతనం రూ.10 వేల మేర పెంపు. ఇప్పటివరకు పోటు కార్మికుల వేతనం రూ.28 వేలు... ఇకపై అది రూ.38 వేలు కానుంది
  • 3,518 మంది టీటీడీ ఉద్యోగులకు ఈ నెల 28న ఇళ్ల స్థలాల పట్టాల అందజేత. జనవరిలో మరో 1,500 మందికి ఇంటి పట్టాలు
  • రిటైర్డ్ ఉద్యోగులకోసం ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేయాలని నిర్ణయం. రూ.85 కోట్లతో 350 ఎకరాలు కొనుగోలు చేయనున్న టీటీడీ
  • పారిశుద్ధ్య విభాగంలో వర్క్ కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపునకు నిర్ణయం
  • ఉగ్రాణం కార్మికులు, వాహన బేరర్లను నైపుణ్య పనివారుగా గుర్తించి ఆ మేరకు వేతనాల పెంపు
  • ప్రతి ఏటా పెద్ద జీయర్ మఠానికి ఇచ్చే ప్యాకేజీ రూ.2 కోట్ల నుంచి రూ.2.60 కోట్లకు పెంపు
  • ప్రతి ఏటా చిన్న జీయర్ మఠానికి ఇచ్చే ప్యాకేజీ రూ.1.70 కోట్ల నుంచి రూ.2.10 కోట్లకు పెంపు
  • తిరుమల కల్యాణకట్టలో పీస్ రేట్ ప్రాతిపదికన పనిచేస్తున్న క్షురకుల కనీసం వేతనం రూ.20 వేలకు పెంపు
  • శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం చేసే భక్తులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని నిర్ణయం
  • తిరుపతిలో పాత సత్రాల స్థానంలో కొత్త వసతి గృహ సముదాయాల నిర్మాణం టెండర్లకు ఆమోదం
  • ఝార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని నిర్ణయం 
  • రూ.14.5 కోట్లతో గోగర్భం డ్యామ్ వద్ద క్యూలైన్ నిర్మాణానికి టెండర్ ఆమోదం

More Telugu News