Chandrababu: చంద్రబాబు నివాసంలో ముగిసిన మహా చండీయాగం, సుదర్శన హోమం.. ఫొటోలు ఇవిగో

  • గత మూడ్రోజులుగా చంద్రబాబు నివాసంలో యజ్ఞయాగాదులు
  • నేడు పూర్ణాహుతి
  • ప్రత్యేక పూజలు చేసిన చంద్రబాబు, నారా భువనేశ్వరి
Maha Chandi Yagam and Sudarshana Homam in Chandrababu residence completed

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో గత మూడ్రోజులుగా జరుగుతున్న యజ్ఞయాగాదులు నేటితో ముగిశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ నెల 22 నుంచి మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. ఇవాళ నిర్వహించిన పూర్ణాహుతితో ఈ క్రతువు సమాప్తం అయింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు, నారా భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

ఈ యాగం చివరి రోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వేదపండితుడు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో 40 మంది రుత్విక్కులు మహా చండీయాగం, సుదర్శన హోమం నిర్వహించారు.




More Telugu News