Telangana: తెలంగాణలో సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరణ

  • లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ 
  • దేశంలో మొత్తం 10 రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతి ఉపసంహరించుకున్నాయని వెల్లడి
  • దక్షిణాదిన కేరళ, తమిళనాడు ప్రభుత్వాలూ అనుమతులు వెనక్కు తీసుకున్న వైనం
Telangana retracted permission for CBI to hold enquires in the state says central minister

దేశంలో సీబీఐ దర్యాప్తునకు అనుమతులు ఉపసంహరించుకున్న 10 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. పంజాబ్, ఝార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరం, మేఘాలయ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐ దర్యాప్తునకు అనుమతిని ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయని వెల్లడించారు.

More Telugu News