తెలంగాణలో నరేంద్రమోదీని చిత్తుగా ఓడించి తెలుగువారి సత్తా చాటుతాను: కేఏ పాల్
- ప్రధాని మోదీ సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోందన్న కేఏ పాల్
- తెలంగాణలో పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందన్న కేఏ పాల్
- బీజేపీతో కలిసినా జనసేనకు కనీసం డిపాజిట్లు రాలేదని విమర్శ
కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను మూడు నెలల్లో అమలు చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవదని జోస్యం చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాను విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలలోనూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనలాంటి వారికి పార్లమెంట్కు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.