Somireddy Chandramohan Reddy: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు

  • సోమవారం రాత్రి 2 గంటల సమయంలో సోమిరెడ్డిని తీసుకెళ్లి ఇంటి వద్ద దింపిన పోలీసులు
  • దీక్షభగ్నం సమయంలో ఉద్రిక్త వాతావరణం
  • పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
Somireddy Chandramohan Reddys Diksha  was disrupted by the police

పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు. 

ఈ సమయంలో పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. టీడీపీ శ్రేణులు పోలీసులకు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు రాత్రి 2 గంటల సమయంలో దీక్షను భగ్నం చేశారు. కాగా పొదలకూరు మండలంలోని తాటిపర్తి సమీపంలో మూడు రోజులక్రితం సత్యాగ్రహ దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.

More Telugu News