దేశవ్యాప్తంగా 19 చోట్ల ఎన్ఐఏ సోదాలు
- ఒక్క కర్ణాటకలోనే 11 చోట్ల అధికారుల తనిఖీలు
- ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీలో గాలిస్తున్న ఎన్ఐఏ
- ఇటీవల మహారాష్ట్రలో 40 చోట్ల దాడులు చేసిన అధికారులు
ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, నగదు, పలు డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పనిచేస్తున్న 15 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు ఐసిస్ సానుభూతి పరుడని, యువతను ఐసిస్ లో చేరుస్తున్నాడని గుర్తించారు. నిందితుడిని మరింత లోతుగా విచారించి సేకరించిన సమాచారంతో అధికారులు తాజా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.