Team India: భారత బౌలర్ల వికెట్ల వేట... 58 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా

  • టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
  • సఫారీలను హడలెత్తించిన అర్షదీప్, అవేష్ ఖాన్
Team India pacers rattled South Africa timber frequently

దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విశేషంగా రాణిస్తున్నారు. అర్షదీప్, అవేష్ ఖాన్ విజృంభించడంతో ఆతిథ్య దక్షిణాఫ్రికా 58 పరుగులకే 7 వికెట్లు చేజార్చుకుంది. జొహాన్నెస్ బర్గ్ లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 

అయితే టీమిండియా లెఫ్టార్మ్ సీమర్ అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్ ధాటికి వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. అర్షదీప్ 4, అవేష్ ఖాన్ 3 వికెట్లతో సఫారీలను చావుదెబ్బ కొట్టారు. ఓపెనర్ టోనీ డి జోర్జి 28, కెప్టెన్ మార్ క్రమ్ 12 పరుగులు చేశారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 13 ఓవర్లలో 7 వికెట్లకు 58 పరుగులు. క్రీజులో ఫెహ్లుక్వాయో (3 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్ (0 బ్యాటింగ్) ఉన్నారు.

More Telugu News