Team India: దక్షిణాఫ్రికా చేరుకున్న కోహ్లీ, బుమ్రా, అశ్విన్

  • డిసెంబరు 26 నుంచి దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
  • ప్రస్తుతం వైట్ బాల్ సిరీస్ లు ఆడుతున్న టీమిండియా
  • టీ20 సిరీస్ 1-1తో సమం
  • రేపటి నుంచి వన్డే సిరీస్
Kohli and others arrives South Africa for test series

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడే టీమిండియాలో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవిచ్రందన్ అశ్విన్ తదితరులు సభ్యులని తెలిసిందే. ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ లు ఆడుతోంది. టెస్టు సిరీస్ ఈ నెల 26న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, జట్టుతో కలిసేందుకు కోహ్లీ, బుమ్రా, అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా దక్షిణాఫ్రికా చేరుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుతో కలవనున్నాడు. ఈ సిరీస్ లో టీమిండియా రెండు టెస్టులు ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా... ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. రేపటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.

More Telugu News