Telangana: ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లు కేటాయించాలని వ్యక్తి నిరసన

  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం
  • మహిళలతో నిండిపోతున్న బస్సులు
  • పురుషులకు సీట్లు కేటాయించారని ఆర్మూర్ బస్టాండ్ వద్ద వ్యక్తి నిరసన
Man protest infront of bus to seats to men in buses

తెలంగాణ ఆర్టీసీ బస్సులలో పురుషులకు కొన్ని సీట్లు కేటాయించాలని ఓ వ్యక్తి ధర్నాకు దిగాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా ఉచితమే. దీంతో మహిళలతో బస్సులు నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మూర్‌లో వాసు అనే వ్యక్తి బస్సు ముందు నిలబడి నిరసన తెలిపాడు. పురుషులకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ... ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన నిరసన తెలిపాడు. ఆ వ్యక్తి నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది.

More Telugu News