Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. విచారణ వాయిదా వేసిన హైకోర్టు

  • కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామన్న సీఐడీ
  • కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టుకు విన్నపం
  • తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు
AP High Court adjourned Assigned lands case

అమరావతి అసైన్డ్ భూముల అంశంపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ వేసిన క్వాష్ పిటిషన్లపై ఇప్పటికే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనాటి విచారణ సందర్భంగా... ఈ కేసులో మరికొందరిని నిందితులుగా చేర్చామని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. కేసును రీఓపెన్ చేయాలని కోర్టును కోరింది. కేసును రీఓపెన్ చేయడంపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News